షాకైన నిజామాబాద్ జిల్లా.. ఆరు హత్యలా!!
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి;

nizamabad shokcer friend kills 6 family members
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేశాడు. ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి... అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకు వెళ్లాడు. బాసర వద్ద గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలోకి తోసేశాడు. ఆ తర్వాత ప్రసాద్ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి, ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకువెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు.