మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురి మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు

Update: 2022-03-14 03:58 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలోని డిండిలో ఈ ఘటన జరిగింది. పండరీపూర్ కు దైవదర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తుల్జాపూర్ లోని కడంవాడి వాసులు పండరీపూర్ కు దైవదర్శనానికి ఒక ట్రాక్టర్ లో బయలుదేరారు. ట్రాక్టర్ లో దాదాపు నలభై మందికి పైగానే ఉన్నారు.

దైవ దర్శనానికి....
అయితే షోలాపూర్ - పూనే హైవై పైన భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా ముప్ఫయి మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను షోలాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News