ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌కమల్ దాస్ అనే వ్యక్తికి ఒకే ఇంట్లో 43 మంది కుమారులు ఉన్నారనే వదంతుల్లో అసలు నిజం ఇదే

నకిలీ ఓటరు కార్డులు, ఓటర్ల తొలగింపు అంశాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో;

Update: 2025-03-15 11:54 GMT
Ram Kamal Das

 Ram Kamal Das

  • whatsapp icon

నకిలీ ఓటరు కార్డులు, ఓటర్ల తొలగింపు అంశాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను ఓటర్ల జాబితా డేటాతో అనుసంధానించాలని అధికారులను ఆదేశించింది.

ఇంతలో, ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటరు జాబితాకు సంబంధించిన ఓ చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఈ జాబితాలో రామ్‌కమల్ దాస్ అనే వ్యక్తి 43 మంది కుమారులకు తండ్రి అని లిస్టులో ఉంది. అంతేకాకుండా వీరందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారని ఆ పోస్టుల్లోని వాదన. ఈ పిల్లల్లో 13 మంది ఒకే సంవత్సరంలో జన్మించారు. వారందరి వయసు 37 సంవత్సరాలని అందులో ఉంది. “According to Election commission’s data this man ‘Ramkamal Das’ has as many as 43 sons all living in the same house. Don’t seek any logic. 13 of those sons were all born in the same year. That’s how authentic ECI is. #RahulGandhi #Akhileshyadav #uddhavthakre” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, 'రామ్‌కమల్ దాస్' అనే వ్యక్తికి ఒకే ఇంట్లో 43 మంది కుమారులు ఉన్నారు. ఆ 13 మంది కుమారులు ఒకే సంవత్సరంలో జన్మించారు. ECI ఎంత ప్రామాణికమైనదో తెలుస్తోందన్నది ఆ పోస్టులో ఉంది.



వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. అందరి తండ్రిగా ఆ లిస్టులో ఉన్న వ్యక్తి వారందరికీ గురువు. ఆయన రామ జానకి మఠం ప్రధాన పూజారి.

మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, 2023 సంవత్సరంలో ప్రచురించిన వార్తా నివేదికలను కనుగొన్నాము. పాత కధనాల ప్రకారం 2023 లో ఆయన తండ్రిగా 48 మంది నమోదు చేసుకున్నారు.


ఈటీవీ భారత్ ప్రచురించిన నివేదిక ప్రకారం, వారణాసిలోని 51వ వార్డు నంబర్ ఓటరు జాబితా చిత్రం ఇదని తేలింది. ఒక వ్యక్తి 48 మంది కుమారుల తండ్రిగా చూపించారు. వైరల్ ఓటరు జాబితాలో చూపబడిన 48 మంది కుమారుల తండ్రి ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఓటరు జాబితా కూడా అధికారికంగా సరైనదని నిర్ధారించారు.
వారణాసిలోని 51వ వార్డు నంబర్ ఓటరు జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో 13 మంది పిల్లలకు 37 సంవత్సరాలు, ఐదుగురు 39 సంవత్సరాలు, నలుగురికి 40 సంవత్సరాలు, మరొకరికి 42 సంవత్సరాలు.
తండ్రి పేరు స్వామి రామ్ కమల్ దాస్, వారణాసికి చెందిన ప్రసిద్ధ సాధువు, గురుధామ్‌లోని రామ్ జానకి ఆలయ స్థాపకుడు. జాబితా ప్రకారం ఆయనకు 48 మంది కుమారులు ఉన్నారు. గురుధామ్‌లో ఉన్న ఆయన ఆలయం చిరునామా కూడా ఓటరు జాబితాలో ఇంటి నంబర్‌గా ఉంది. స్వామి రామ్ కమల్ దాస్ 48 మంది కుమారుల పోస్ట్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే స్వామి జీ కార్యదర్శి కూడా ఈ జాబితా సరైనదని ధృవీకరించారు. దీనిని ధృవీకరిస్తూ, స్వామి రామ్ కమల్ దాస్ కార్యదర్శి రాంభరత్ ఈ జాబితా పూర్తిగా సరైనదని అన్నారు. స్వామి జీ అవివాహితుడు. కానీ, మా ఆశ్రమంలో గురు-శిష్య సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీని కారణంగా, ఈ ఆశ్రమంలో నివసించే విద్యార్థులందరూ స్వామిజీని తమ గురువు, తండ్రిగా భావిస్తారు. అందుకే ఈ ఓటరు జాబితాలో తండ్రి పేరు స్థానంలో గురువు పేరును నమోదు చేసారు.


జాగ్రన్ నివేదిక ప్రకారం, మున్సిపల్ ఎన్నికల మొదటి దశలో గురువారం నాడు భేలుపూర్ లోని వార్డు నెం.51 ఓటర్ల జాబితా చర్చనీయాంశంగా మారింది. భేలుపూర్ లోని వార్డు నెం.51లోని ఖోజ్వాన్-కాశ్మీరీగంజ్ ఓటర్ల జాబితాలో, 48 మంది ఓటర్ల తండ్రి పేరు రామ్ కమల్ దాస్ గా నమోదు చేశారు. ఓటర్ల వయస్సు భిన్నంగా ఉంది, కానీ చిరునామా ఒకటే - ఇంటి నంబర్ B, 24/19. ఈ వార్త ఆన్ లైన్ లో విపరీతంగా వ్యాపించింది. ఎస్పీ కూడా దీనిని పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. అయితే, నిజం తెలిసిన వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. నిజానికి, స్వామి రామ్ కమల్ దాస్ వేదాంతి రామ్ జానకి మఠం ఖోజ్వాన్ ప్రధాన పూజారి. గురు-శిష్య సాధువు సంప్రదాయంలో చేరిన తర్వాత శిష్యుల పేరు దగ్గర తండ్రి పేరు స్థానంలో గురువు పేరు రాశారని మఠం మేనేజర్ రాంభరత్ శాస్త్రి వివరించారు. గతంలో, స్వామి జీ పేరు 150 మందికి తండ్రిగా నమోదు చేశారు. ఇప్పుడు ఈ సంఖ్య 48కి తగ్గింది.

అందువల్ల, ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రం 2023 సంవత్సరం నాటిది. వారణాసి అసెంబ్లీ ఎన్నికల నాటిది. ఇంత మంది వ్యక్తులకు తండ్రిగా నమోదు చేసుకున్న వ్యక్తి వారి గురువు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటరు జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌కమల్ దాస్ అనే వ్యక్తికి ఒకే ఇంట్లో 43 మంది కుమారులు ఉన్నారు
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News