సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మూసివేత.. ప్రత్యామ్నాయంగా?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పనులు వేగం పుంజుకోవడంతో కొన్ని ప్లాట్ఫామ్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు;

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వేగం పుంజుకున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు గత కొంతకాలంగా పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అయితే ఇప్పటివరకూ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పనులు జరుగుతున్నాయి.
ఆరు ప్లాట్ ఫామ్ లును...
అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పనులు వేగం పుంజుకోవడంతో కొన్ని ప్లాట్ఫామ్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లను రైల్వే శాఖ అధికారులు క్లోజ్ చేశారు. ముఖ్యమైన కొన్ని రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్ల మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. వంద0 రోజుల పాటు ఆరు ప్లాట్ఫామ్లు మూసివేస్తున్నట్లు తెలిపింది.