'24'కు ఆడియో ముహూర్తం...!

Update: 2016-04-05 02:20 GMT

తమిళస్టార్‌ హీరో సూర్య, 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '24'. కాగా ఈచిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం తమిళ, తెలుగు ఆడియోలను ఈనెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయం తమిళ ఆడియోను విడుదల చేసి, సాయంత్రం తెలుగు ఆడియోను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంపై వరస అపజయాలలో ఉన్న సూర్య ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సూర్య హరి దర్శకత్వంలో చేస్తున్న 'సింగం3' విడుదల కానుంది. ఆ తర్వాత ఆయన హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాలో చేయనున్నాడు. మరోపక్క దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ అల్లు అర్జున్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. కాగా ఈచిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్‌ను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగ గతంలో అమీజాక్సన్‌ రామ్‌చరణ్‌, బన్నీలు నటించిన 'ఎవడు' చిత్రంలో కీలకపాత్రను పోషించిన సంగతి తెలిసిందే. కాగా శంకర్‌ దర్శకత్వంలో 'ఐ' చిత్రం చేసిన ఆమె ప్రస్తుతం రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌లతో శంకర్‌ దర్శకత్వలో రూపొందుతున్న 'రోబో2.0' చిత్రంలో నటిస్తోంది. కాగా బన్నీ నటించే చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా నిర్మితం కానుండటంతో అమీజాక్సన్‌ అయితేనే సరిగ్గా సూట్‌ అవుతుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News