మంజూష ఎవరికి ఎసరు పెడుతుంది!!

యాంకర్ మంజూష అందరికి సుపరిచితురాలు. రాఖి సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలి గా నటించిన మంజూష యాంకర్ గా విపరీతంగా పాపులర్ అయ్యింది. అనసూయ లాగా పెళ్లి [more]

Update: 2020-05-28 05:56 GMT

యాంకర్ మంజూష అందరికి సుపరిచితురాలు. రాఖి సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలి గా నటించిన మంజూష యాంకర్ గా విపరీతంగా పాపులర్ అయ్యింది. అనసూయ లాగా పెళ్లి తరవాత కూడా హాట్ హాట్ డ్రెస్సుల్తో యాంకరింగ్ చేస్తున్న మంజూష హీరోయిన్స్ కి పోటీగా గ్లామర్ డ్రెస్సుల్తో ఫోటో గ్రాఫర్స్ కి పని చెబుతుంది. మంజూష యాంకరింగ్ చేసే ఫంక్షన్ లో మంజూష స్పెషల్ గాలరీని ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించాల్సిందే. అయితే తాజాగా మంజూష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా యాంకర్ ప్లేస్ లో అంటున్నారు.

గతంలో హైపర్ ఆది స్కిట్ లో మంజూష కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇక తాజాగా మంజూష జంబర్దస్త్ యాంకర్ గా హాట్ హాట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అని…. అయితే అది అనసూయ ప్లేస్ కా, రష్మి ప్లేస్ కి ఎసరు పెడుతుందా అనే క్లారిటీ లేదు కానీ… కరోనా లాక్ డౌన్ ముగియగానే మంజూష జబర్దస్త్ కి జబర్దస్ ఎంట్రీ ఖాయమనే మాట వినబడుతుంది. లాక్ డౌన్ ముగియగానే బిగ్ బాస్ షో మొదలు కానుంది అని.. అందులో యాంకర్ రష్మీ కానీ, అనసూయ కానీ భారి పారితోషికానికి వెళ్ళబోతున్నారని.. అందుకే జబర్దస్త్ కి తాత్కాలిక విరామం ఇవ్వబోతున్నారని.. ఆ టైం లోనే మంజూష జబర్దస్త్ కి రాబోతుంది అనే అనుమానం మాత్రం ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Tags:    

Similar News