అక్షర నటిస్తున్న చిత్రం చేయనని వచ్చేసిన రకుల్!

Update: 2016-10-13 11:33 GMT

వరుసగా అగ్ర తారలతో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాల్సి ఉన్నప్పటికీ కాల్ షీట్స్ సర్దుబాటు చెయ్యలేక ఆ అవకాశం వదులుకుంది. రకుల్ కి మళ్లీ ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రంతో సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం లభించింది. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ చిత్ర అవకాశం రాకముందే తమిళంలో విశాల్ సరసన తుప్పరివాలం చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఆ చిత్రం మొదలుకావటానికి ఎక్కువ సమయం పట్టింది.

ఇంతలో మురగదాస్ మహేష్ చిత్రం ఒప్పుకోవటం, కాల్ షీట్స్ ఇచ్చేయటం అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు విశాల్ సినిమా మొదలుకావటంతో కాల్ షీట్స్ సర్దుబాటు కాక తెగ సతమతమవుతుంది అంట రకుల్. ఒక పక్క రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ధ్రువ చిత్రీకరణ ఇంకా జరుగుతూనే ఉంది. అందులోనూ రకుల్ ప్రీత్ సింగే కథానాయిక. అలానే సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేనిల చిత్రానికి కొన్ని డేట్స్ సర్దింది రకుల్. అందుకే తప్పని పరిస్థుతుల్లో విశాల్ సినిమా వదులుకుంది అంట. ఈ చిత్రంలో మరో నాయికగా షమితాబ్ ఫేమ్ అక్షర హాసన్ నటిస్తుండగా, రకుల్ స్థానంలో వేరే నాయికను ఎంపిక చేయనున్నారు.

చియాన్ విక్రమ్ నటించబోయే సామి 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగే కథానాయిక. రకుల్ నటిస్తున్న ధ్రువ చిత్రం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News