అఖిల్ అల్లరి చూస్తారా..!!

Update: 2017-05-08 10:09 GMT

చిరంజీవి హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో కి సెలబ్రిటీస్ పోటెత్తుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అందరూ ఈ షో లో మెరుస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి భారీ సంఖ్యలో హాజరవుతున్న సెలబ్రిటీస్ తో చిరు ఎంతో క్లోజ్ గా మాట్లాడుతూ.... వారిని ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలతోపాటు ప్రొఫెషనల్ విషయాలను అడుగుతూ ఈ గేమ్ షోని వారితో ఆడిస్తున్నాడు.

అక్కినేని అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమా షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. అయితే తాజాగా అఖిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లో అతిధిగా కనబడుతున్నాడు. బుల్లితెర స్క్ట్రీన్ మీద చిరు, అఖిల్ లు సందడి చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తో సెల్ఫీకి ఫోజు ఇస్తున్న ఫోటోని ఒకటి అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. వారిద్దరూ మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్ మధ్యలో నించుని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇక ఇక్కడ గేమ్ షో ద్వారా వచ్చిన డబ్బుతో పాటే తన తల్లి అమల నడుపుతున్న రెడ్ క్రాస్ సంస్థకి చిరు కొంత మొత్తాన్ని డొనేట్ చేసారని..... అందుకు చిరంజీవిగారికే కృతఙ్ఞతలు అంటూ పోస్ట్ చేసాడు అఖిల్.

Similar News