అనుష్క శర్మ సహజత్వ నటన.. రణబీర్ చెంప పేలింది!

Update: 2016-10-11 10:03 GMT

పాత చిత్రాలలో నటులు పలికించే హావభావాలను నేటి తరం ప్రేక్షకులు ఆస్వాదించ లేకపోతున్నారు. అన్ని భావాలను సహజంగా పలికించే నటీనటులనే ఆదరిస్తున్నారు. అందుకే నేటి తరం నటులు సంభాషణలు పలికే తీరుకూ, నాటి తరం వారు పాటించిన తీరుకూ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అలానే విషాద సన్నివేశాలలో కూడా గ్లిసరిన్ వాడి కంట నీరు పెట్టుకునే నటుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ అంతా సగటు ప్రేక్షకుడి ఆదరణ కోసమే జరుగుతుంది. కానీ ఈ సహజత్వ నటనను పండించటానికి నటీనటులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదండోయ్.

ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన తాజా చిత్రం హే దిల్ హై ముష్కిల్ చిత్రంలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో రణబీర్ కపూర్ చేష్టలకు విసిగిన అనుష్క శర్మ కోపంతో రణబీర్ చెంప చెళ్లుమనిపించాలి అంట. ఆ సన్నివేశాన్ని సహజంగా చిత్రీకరించే ఉద్దేశంతో నిజంగానే అంతా పనీ చేసింది అంట అనుష్క శర్మ. పైగా ఆ సన్నివేశం మూడవ టేక్ లో ఓకే అవగా, మూడు సార్లు నిజంగానే చెంప దెబ్బలు తిన్నాడు రణబీర్ కపూర్.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన హే దిల్ హై ముష్కిల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28 న విడుదల కు సిద్ధం అవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Similar News