కుర్రకారు చుట్టుముట్టి కిందపడ్డ హీరోయిన్

Update: 2016-10-13 12:04 GMT

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కథానాయిక దిశా పటాని. లోఫర్ చిత్రం ఆశించినంత ఫలితం సాధించక పోయినప్పటికీ దిశా పటానికి వెంటనే బాలీవుడ్ ఎం.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ వంటి ప్రతిష్టాత్మక చిత్ర అవకాశంతో స్వాగతం పలికింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. కానీ ఆ చిత్రంలో దిశా పటాని చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర పోషించినందు వల్ల చిత్రం విజయం పొందినప్పటికీ దిశా పటానికి ఎక్కువ గుర్తింపు రాలేదు. తాను లోఫర్ చిత్రం తర్వాత మరే తెలుగు చిత్రాన్ని అంగీకరించలేదు.

హైదరాబాద్ లోని ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి దిశా పటాని ని ఆహ్వానించింది ఆ దుకాణపు యాజమాన్యం. హైదరాబాద్ ప్రజలలో అంత గుర్తింపు ఉండని నటి కనుక సెక్యూరిటీ సిబ్బందిని నామమాత్రపు సంఖ్యలో పెట్టి కానించేదం అనుకుంది సగటు యాజమాన్యం. కానీ పరిస్థితి మరోలా ఎదురు తిరిగి దిశా పటానికి హైదరాబాద్ అంటే భయం పుట్టేలా చేసింది. దిశా కార్ దిగటం చుసిన కురాళ్ళు వందలాది సంఖ్యలో పోగై దిశాను కార్ నుంచి దుకాణం ముఖ ద్వారం వరకు వెళ్లే దారిలో చుట్టుముట్టారు. వారిని అదుపు చెయ్యలేని సిబ్బంది చేతులు ఎత్తేసారు పాపం. ఆ తోపులాటలో దిశా అదుపు తప్పి కింది పడిపోగా తన ఎడమ చేతికి గాయం కూడా ఐయింది అంట.

ముంబై నగరంలో అనేక దుకాణాల ప్రారంబోత్సవాలలో పాల్గొన్నా ఎప్పుడు ఇలా జరగలేదు అని, హైద్రాబాదులోనే ఇలా జరిగింది అని వాపోయింది దిశా పటాని. ప్రస్తుతం కుంగ్ ఫూ యోగ అనే చిత్రంలో నటిస్తుంది దిశా.

Similar News