చిరంజీవే నా అభిమాన నటుడని వెల్లడించిన దాసరి

Update: 2016-10-08 14:07 GMT

చిత్ర పరిశ్రమ అంత భారీ వ్యయాలతో నిర్మితమవుతున్న చిత్రాలలో నిమగ్నమై ఉన్నప్పుడు తక్కువ వ్యయంతో ఈ రోజుల్లో చిత్రాన్ని విడుదల చేసి ఆ విజయంతో మొత్తం పరిశ్రమని తన వైపు తిప్పుకున్నారు దాసరి మారుతీ. ఈ రోజుల్లో, బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయి, బాబు బంగారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతీ, దసరా పండుగ సందర్భముగా ఆయన సొంత ఊరు ఐన మచిలీపట్టణం వచ్చారు. ఇక్కడ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన సినీ జీవిత విశేషాలను పంచుకున్నారు.

"15 ఏళ్ళ క్రితం ఆనిమేషన్ లో కొంత ప్రావీణ్యం ఉన్న నేను అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ లకు డ్రాయింగ్ నేర్పేవాడిని. ఆ సమయంలోనే అంజి చిత్రం ఆనిమేషన్ యూనిట్లో నాకు అవకాశం దొరికింది. అప్పటి నుంచి నాకు మెగా కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. నేను మచిలీపట్టణం లో వుండే రోజుల నుంచే మెగా స్టార్ చిరంజీవి గారికి వీర అభిమానిని. ఆయన చిత్రాలు అన్ని వదలకుండా చూసే వాడిని. ప్రస్తుతం కొత్త హీరోతో ఒక చిన్న చిత్రం ప్రారంభించబోతున్నా. మార్చిలో నానితో ఒక చిత్రం, వచ్చే ఏడాదిలోనే అక్కినేని అఖిల్ తో ఒకే చిత్రం చెయ్యటానికి సన్నద్ధమవుతున్నా" అని దాసరి మారుతీ తన రాబోయే చిత్రాల గురించి వివరణ ఇచ్చారు.

మారుతీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం బాబు బంగారం విక్టరీ వెంకటేష్ నట జీవితంలోనే సోలో హీరో గా అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

Similar News