చెర్రీపై డైరక్టర్ మాటే నెగ్గింది!

Update: 2016-10-25 11:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ధ్రువ చిత్రీకరణ దాదాపు తుది దశకి చేరుకుంది. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయిపోగా, హీరో పరిచయ పాట చిత్రీకరణ బాకీ వుంది. ఈ వారంలో అది కూడా పూర్తి చేసుకుని మరో పక్క ఆడియో విడుదల వేడుకకు సిద్ధం అవుతుంది ధ్రువ. ఈ ప్రణాళిక మొత్తాన్ని మొదటి నుంచి పాటిస్తున్న సుకుమార్ చెర్రీ తో తన చిత్రాన్ని నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని యోచించారు కానీ ఆ చిత్రం నెల రోజులు వాయిదా పది డిసెంబర్ లో చిత్రీకరణ ప్రారంభానికి ముహూర్తం పెట్టుకుంది.

ఈ నెల రోజుల వాయిదాకి కారణం ఛాయాగ్రాహకుడి కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవటమే. ముందుగా మనోజ్ పరమహంస ను ఛాయాగ్రాహకుడిగా అనుకున్నా, రత్నవేలు తో దర్శకుడు సుకుమార్ కి ఉన్న సాన్నిహిత్యం వలన ఆయన రత్నవేలు కే ప్రాధాన్యత ఇవ్వటంతో చెర్రీ కూడా మనోజ్ ను తిరస్కరించాడు. రత్నవేలు ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 చిత్రీకరణ లో బిజీ గా వున్నారు. డిసెంబర్ రెండవ వారానికి ఆ చిత్రం పూర్తి అవుతుంది. ఆ తరువాత చెర్రీ సుక్కు ల చిత్రం ప్రారంభం అవుతుంది.

సుకుమార్ ఇప్పటికే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడంట. డిసెంబర్ లో ప్రారంభం కానున్నప్పటికీ మే నెల లోపు చిత్రీకరణ పూర్తి చేసి 2017 వేసవికే చిత్రాన్ని విడుదల చెయ్యాలని సుకుమార్ ఆలోచన.

Similar News