తెలుగు ప్రేక్షకులకు చేరువలో సన్నీ

Update: 2016-10-07 16:07 GMT

నటన లో ప్రతిభ ఏ మాత్రం కనబరచగలదో దక్షిణ భారత సినిమా ప్రేక్షకులకు అవగాహన లేకపోయినా, అంధ చందాల విషయంలో మాత్రం పరిచయం అవసరం లేని పేరు సన్నీ లియోన్. అనేక హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతుంది సన్నీ. మన నిర్మాతలు సన్నీ ని తెలుగు చిత్రాలలో నటింపచేసే ప్రయత్నాలు చెయ్యక మానలేదు. కానీ పాత్ర కుదిరినప్పుడు పారితోషికం నచ్చక, అధిక పారితోషికాలు అందే దగ్గర పాత్ర నచ్చక, రెండు కుదిరితే కాల్ షీట్స్ సర్దుబాటు కాక ఇలా అనేక కారణాల వల్ల ఎంతో క్రేజ్ ఉన్న సన్నీ ఇప్పటి వరకు తెలుగులో కేవలం కరెంటు తీగ చిత్రంలో చాలా తక్కువ నిడివి ఉన్న ఒక అతిధి పాత్రలో స్కూల్ టీచర్ గా కనిపించి అలరించింది.

ఇప్పుడు రాగిణి ఎం.ఎం.ఎస్, జిస్మ్ లాంటి చిత్రాలతో సన్నీ లియోన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి అందాల తార పారితోషికం పెంచకుండా ఉంటుందా?? అవీ పెరిగాయ్. ఇక ఇప్పుడు సన్నీ ని మన చిన్న నిర్మాతలు కదపలేని పరిస్థితి ఏర్పడింది. కానీ గుంటూరు టాకీస్ చిత్ర నిర్మాత ఆ చిత్రానికి కొనసాగింపుగా గుంటూరు టాకీస్ 2 చిత్రం ప్రారంభించబోతున్నారు. సన్నీ లియోన్ అయితే చిత్ర మార్కెట్ విస్తృతంగా ఉండొచ్చు అనే అంచనాతో ధైర్యం చేసి సన్నీ లియోన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో అనువాద చిత్ర రూపాన సన్నీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. రాగిణి ఎం.ఎం.ఎస్ చిత్రాన్ని తెలుగు భాషలో రాత్రి పేరుతో అనువదించి విడుదల చెయ్యటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ చిత్రం లో రష్మీ గౌతమ్ నటించిన విషయం విదితమే. కథ కథనాల్లో నాణ్యత లేకపోయినా ప్రచార చిత్రాల్లో రష్మీ గౌతమ్ అందాల ఆరబోత ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించగలిగింది. మరి ఇప్పుడు రష్మీ గౌతమ్ బదులు సన్నీ లియోన్ అయితే మరి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Similar News