తేరి రిలీజ్ కోసం వేచిచూస్తున్న మహేష్‌....!

Update: 2016-04-11 23:56 GMT

విజయ్‌ హీరోగా నటించిన 'పోలీసోడు' (తేరీ) చిత్రం ఈనెల 14న తమిళ, తెలుగుభాషల్లో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి 'రాజు రాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను చూసిన మహేష్‌బాబు బాగా థ్రిల్‌గా ఫీలై వెంటనే దర్శకుడు అట్లీకి ఫోన్‌ చేసి బెస్ట్‌ విషెష్‌ చెప్పడంతోపాటు ఏదైనా కథ ఉంటే చెప్పు కలిసి చేద్దామని ప్రపోజల్‌ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో అసలు ఆలస్యం చేయకుండా అట్లీ హైదరాబాద్‌కి వచ్చి గత కొద్దిరోజులుగా మహేష్‌తో సిట్టింగ్స్‌ జరుపుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని, కేవలం డిస్కషన్‌ స్టేజీలోనే ఉందని, 'తేరీ' (పోలీసోడు) రిలీజ్‌ అయిన తర్వాత ఈ చిత్రం సాధించే ఫలితాన్ని బట్టి మహేష్‌ నిర్ణయం తీసుకోనున్నాడు. దీంతో క్లారిటీ కోసం కొన్ని రోజులు ఆగాల్సివుంది. తమిళంలోనూ తన మార్కెట్‌ పెంచుకునే పనిలో ఉన్న మహేష్‌ ఈ మధ్య ఎక్కువగా తమిళ దర్శకుల వైపు దృష్టి సారిస్తున్నాడని సమాచారం. అందులో భాగంగానే మురుగదాస్‌ను లైన్లో పెట్టాడు. కాగా 'బ్రహ్మూెత్సవం' చిత్రం తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే అయిన మే31కి ముందే రిలీజ్‌ కానుంది. దాంతో సాధారణంగా తన తండ్రి పుట్టినరోజునాడు ఏదో ఒకటి చేసే మహేష్‌ ఈ సారి కృష్ణ బర్త్‌డే కానుకగా మురుగదాస్‌ చిత్రాన్ని అఫీషియల్‌గా లాంచ్‌ చేయనున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంతోష్‌శివన్‌, హారీస్‌ జైరాజ్‌ వంటి టెక్నీషియన్స్‌ పనిచేస్తుండగా, హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ పరిణితి చోప్రా దాదాపు కన్‌ఫర్మ్‌ అయినట్లేనని తెలుస్తోంది.

Similar News