నందమూరి, పూరీ కాంబినేషన్ చిత్రం, ఆడియో 5న

Update: 2016-10-02 05:21 GMT

నందమూరి వారి హీరో కల్యాణ రామ్ చాలా సెలక్టివ్ గా మాత్రమే చిత్రాలు చేస్తూ ఉంటారనేసంగతి అందరికీ తెలిసిందే. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుంటారు. చాలా వరకు చిత్రాల్ని తనే నిర్మించుకుంటూ ఉంటారు కూడా.

ఆ క్రమంలో భాగంగా.. కల్యాణ రాం ఇప్పుడు పూరీ జగన్నాధ్ తో ప్రతిష్టాత్మక చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా కల్యాణ రామే నిర్మాత. ‘ఇజం’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో చిత్రం తయారవుతోంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆడియోను ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. ఆడియో విడుదలకు సంబంధించిన పోస్టర్లను తాజాగా రిలీజ్ చేశారు.

కల్యాణరామ్ చాలా కాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఆయన ఖాతాలో మంచి పేరు తెచ్చిన చిత్రాలున్నాయి గానీ.. బ్లాక్ బస్టర్లు లేవు. అయితే క్రియేటివ్ డైరక్టర్ పూరీ జగన్ తో, నందమూరి వారి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Similar News