మరో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకువస్తున్న ప్రభాస్

Update: 2016-10-25 08:56 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలు అనేక పరియాయాలు బాలీవుడ్ కథానాయికలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయికల ఎంపిక విషయంలో పెద్దగా చొరవ చూపడు. ప్రభాస్ ప్రమేయం లేకుండానే అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఏక్ నిరంజన్ చిత్రంతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐయింది. ఇప్పుడు బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ కి కూడా బాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు లభిస్తుంది.

బాలీవుడ్ లో ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ బాహుబలి చిత్రం పై అంచనాల వలన వచ్చినదా లేక సుస్థిరంగా కొనసాగే ఆదరణా అనేది యూ.వి క్రియేషన్స్ వారు తేల్చుకోలేకపోతున్నారు. బాహుబలి మార్కెట్ ని కాష్ చేసుకునే క్రమంలో ప్రభాస్ తదుపరి చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. మరి ఆ పెట్టుబడికి దగ్గ రాబడి రాబట్టుకోవటానికి యూ.వి.క్రియేషన్స్ సంస్థ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ప్రభాస్ సరసన నటించటానికి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తో చర్చలు జరుపుతున్నారు అంట.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ చిత్రంపై పరిణీతి కూడా ఆసక్తి కనపరుస్తుంది అంట. పరిణీతి నటిస్తే ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్ కి అదనంగా చిత్రానికి ప్రధాన బలం తోడైనట్టే.

Similar News