మరోసారి తెరపై కాశ్మీరీ అందాలు....!

Update: 2016-04-01 14:59 GMT

మన టాలీవుడ్‌ వారికి ఎంతసేపటికి విదేశాలకు వెళ్లి మంచి మంచి లొకేషన్లలో పాటలు తీయడం, లేదా కోట్లు ఖర్చు చేసి సెట్టింగులు వేయడం మామూలైపోయింది. కానీ మన దేశంలోనే ఉన్న అందమైన ప్రదేశాలను మాత్రం వారు పట్టించుకోరు. ఇక విషయానికి వస్తే మిస్టర్‌ జీనియస్‌గా పేరొందిన మణిరత్నం ఇటీవల ఫామ్‌లో లేనప్పటికీ 'ఓకే బంగారం' విజయంతో మరలా తనను తాను అప్‌డేట్‌ చేసుకున్నాడు. గతంలో ఆయన తీసిన దృశ్యకావ్యం 'రోజా' చిత్రంలోని ఎక్కువ పార్ట్‌ను ఆయన కాశ్మీర్‌లోనే తీసి ఆయా అందాలతో మనకు కనువిందు చేశాడు. కాగా ప్రస్తుతం మణిరత్నం హీరో కార్తి, హీరోయిన్‌ సాయిపల్లవిల కాంబినేషన్‌లో ఓ క్యూట్‌లవ్‌స్టోరీని తీయనున్న సంగతి తెలిసిందే కాగా ఈచిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించనున్నాడు. సెప్టెంబర్‌ నుండి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. కాగా ఈచిత్రంంలోని అత్యధిక పార్ట్‌ను కాశ్మీర్‌ అందాల నేపథ్యంలో తీయడానికి మణిరత్నం డిసైడ్‌ అయ్యాడని సమాచారం. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఐఫీస్ట్‌గా మారడం ఖాయమని మణి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

Similar News