మళ్ళీ చెట్టెక్కేసిందట

Update: 2017-11-01 10:00 GMT

గత ఏడాది బ్రహ్మ్మోత్సవం సినిమావంటి డిజాస్టర్స్ తో చేతిలో సినిమాలు లేక ఖాళీగా కూర్చున్న కాజల్ అగర్వాల్ కి ఖైదీ నెంబర్ 150 హిట్ తో మళ్ళీ దశ తిరిగింది. అయినా కూడా చిన్న బడ్జెట్ సినిమా అయిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన తక్కువ పారితోషకానికే పనిచేసింది. ఆ సినిమా హిట్ అవడం.. తమిళంలో అజిత్ తో నటించిన వివేగం ప్లాప్ అయినప్పటికీ... విజయ్ సరసన నటించిన మెర్సల్ కమర్షియల్ హిట్ సాధించడం తో కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకొచ్చేసింది. దెబ్బకి దశ తిరిగిన కాజల్ కి ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అంటున్నారు.

వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకొచ్చిన కాజల్ అగర్వాల్ పారితోషకం విషయంలో చెట్టెక్కి కూర్చుంది. గతంలో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు డిమాండ్ కి తగ్గ పారితోషకం వసూలు చేసిన కాజల్ గత ఏడాది ప్లాప్స్ తో తన పారితోషకాన్ని తగ్గించుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన పారితోషకం విషయంలో రాజీపడనంటుంది. ఇప్పుడు కాజల్ చేతిలో కళ్యాణ్ రామ్ సినిమా ఎమ్యెల్యే ఉండగా.. ఇప్పడూ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేయగా.. కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట కాజల్. కానీ ఈ సినిమాకు నిర్మాతలు 70 లక్షల పారితోషకం అని చెప్పగానే ఆమె ఈ సినిమాలో చెయ్యడానికి నో అనేసిందట.

కోటికి తక్కువైతే తన దగ్గరకి రావద్దని.... అసలు కోటికి తక్కువ ఉంటె ఎటువంటి సినిమా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిందట. దీంతో భయపడ్డ నిర్మాతలు కాజల్ కు బై బై చెప్పేసి వేరే హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టారట. మరి కాస్త ఫామ్ లోకి రాగానే ఇలా చెట్టెక్కి ఆకాశాన్ని చూసే హీరోయిన్స్ ని ఏమనాలి.

Similar News