ముగ్గురు హీరోలతో హాట్ ట్రిక్ కాంబినేషన్ అవుతోన్న కథానాయిక

Update: 2017-02-27 02:51 GMT

బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో-హీరోయిన్ కాంబినేషన్స్ ఒకసారి సక్సెస్ అయితే వరుసగా కొన్ని పదుల సంఖ్యలో అదే కాంబినేషపీన్ కోసం అగ్ర నిర్మాణ సంస్థలు పోటీపడేవి. అందుకే నాగేశ్వర రావు-సావిత్రి గారి కాంబినేషన్, శోభన బాబు-వాని శ్రీ ల కాంబినేషన్, కృష్ణ-విజయ నిర్మల, మరియు కృష్ణ-శ్రీ దేవి ల కాంబినేషన్లు ప్రేక్షకులు అన్ని సార్లు చూడగలిగారు. కానీ నేటి తరం పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఒక సారి ఒక హీరో-హీరోయిన్బ్ కాంబినేషన్ సక్సెస్ అయితే తిరిగి అదే కాంబినేషన్ రిపీట్ చేయటానికి ఏ నిర్మాతైనా ఆలోచన చేయటం ఆలస్యం, ఆ కాంబినేషన్ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ హీరో, హీరోయిన్లు భారీగా పారితోషికాలు పెంచేస్తున్నారు. అందుకే పాత చిత్రాలలో కనిపించిన రిపీట్ కాంబినేషన్స్ నేటి తరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో రెజినా ముచ్చటగా ముగ్గురు కథానాయకులతో మూడవ సారి జత కట్టి ముగ్గురు హీరోల సరసన హాట్ ట్రిక్ కాంబినేషన్ హీరోయినిగా రికార్డు సాధించింది. నారా రోహిత్ సరసన ఇప్పటికే శంకర, జ్యోఅచ్చుతానంద చిత్రాలలో నటించిన రెజినా ఇప్పుడు రోహిత్ సరసన హీరోయిన్ గా పవన్ మల్లెల తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. మరో వైపు నక్షత్రం చిత్రంలో కథానాయికగా నటించిన రెజినా ఆ చిత్రంలో కథానాయకులుగా నటించిన ఇద్దరు హీరోలు సందీప్ కిషన్ మరియు సాయి ధరమ్ తేజ్ లతో గతంలో చేరి రెండు చిత్రాలలో నటించింది. రొటీన్ లవ్ స్టోరీ, రారా క్రిష్నయ్య చిత్రాలలో సందీప్ కిషన్ కి జంటగా నటించిన రెజినా, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలలో సాయి ధరమ్ తేజ్ తో జత కట్టింది. ఇప్పుడు కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం చిత్రంలో ఈ ఇద్దరు యువ కథానాయకులతో మూడవ సారి తెరను పంచుకోనుంది.

Similar News