సర్దార్ గబ్బర్ సెంటిమెంట్.. మెగాస్టార్ డోంట్ కేర్!

Update: 2016-10-14 10:25 GMT

సినిమాల్లో జనరల్ గా సెంటిమెంట్లు రాజ్యం చేస్తుంటాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అలాంటి సెంటిమెంట్లకు డోంట్ కేర్ అన్నట్టున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ చూసి కూడా.. అదే కాంబినేషన్‌తో ముందుకు సాగడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా ఉంది.

వెండి తెర పై అగ్ర తారగా 148 చిత్రాలలో నటించి చిత్ర పరిశ్రమ నుంచి కొద్దిగా విరామం తీసుకుందాం అనుకున్నారు మెగా స్టార్ చిరంజీవి. అనుకోని కారణాల వల్ల ఆ విరామంలోనే ఏడు సంవత్సరాలు గడిపేశారు మెగా స్టార్. గత సంవత్సరం విడుదల ఐన బ్రూస్ లీ చిత్రంలో అతిధి పాత్రతో తిరిగి తెరపై కనిపించారు. అప్పటికి ఆగడు వైఫల్యంతో ఉన్న శ్రీను వైట్ల, గోవిందుడు అందరి వాడేలే, జంజీర్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటంతో నీరసించిన రామ్ చరణ్ తేజలు చిరంజీవి అతిధి పాత్ర ప్రేక్షకులను అలరించి వారికి తిరుగులేని విజయాన్ని అందిస్తుంది అని ఆశించారు. చిరంజీవి తెరపై కనిపించినంత సేపు ఈలలు గోలలతో థియేటర్లు మారుమోగినా, ఫలితం విషయంలో మాత్రం ప్రభావం చూపలేదు.

మెగా స్టార్ చిరంజీవి పూర్తి స్థాయి ద్వితీయ పాత్రలలో కనిపించబోయే తన 150 వ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ముఖ్య కథానాయిక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. ముందు నుంచి ప్రత్యేక గీతంలో నృత్యం చెయ్యబోయే తార కాథరిన్ థెరెసా అని ప్రచారం సాగింది. కాథరిన్ తో చిత్రీకరణ మొదలైన రోజే చిత్ర బృందం లోని కొందరు సభ్యులతో మనస్పర్థలు తలెత్తటంతో కాథరిన్ బదులు లక్ష్మి రాయ్ తో ప్రత్యేక గీతం చూపిస్తున్నారు. ఇదే గీతంలో చిత్ర నిర్మాత ఐన రామ్ చరణ్ తేజ్ కూడా కనిపిస్తారని సమాచారం.

ఇదే సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా, లక్ష్మి రాయ్ ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆ చిత్ర ఫలితం విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి. కానీ అదే తారాగణాన్ని బాడ్ సెంటిమెంట్ అనుకోకుండా మెగా స్టార్ కాలిబర్ పై నమ్మకంతో రామ్ చరణ్ తేజ్ ధైర్యం చేసి చిత్రీకరణ జరిపిస్తున్నారు.

Similar News