సినిమా ఆఫీసు ప్రారంభించిన తలసాని, వినాయక్

Update: 2016-10-12 12:25 GMT

'కృష్ణ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో టాలీవుడ్ కు నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు కాశీ విశ్వ‌నాధ‌మ్. ర‌వితేజ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'ల‌క్ష్మీ న‌ర‌సింహ విజువ‌ల్స్' ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజై అప్ప‌ట్లో క‌మ‌ర్శియ‌ల్ గా భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎంద‌రో స్టార్ హీరోల సినిమాల‌ను తెలుగు రాష్ర్టాల్లో 'శ్రీరామ‌కృష్ణ పిక్చ‌ర్స్' అనే డిస్ర్టీబ్యూష‌న్ సంస్ధ ద్వారా రిలీజ్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన 'నాయ‌క్' చిత్రాన్ని గుంటూరు ఏరియా.. గోపీచంద్ హీరోగా రూపొందిన 'శంఖం', నితిన్ న‌టించిన 'దిల్' సినిమాలను ఈస్ట్, వెస్ట్ గోదావ‌రి ఏరియాలు డిస్ర్టిబ్యూష‌న్ ఈ సంస్ధ ద్వారానే జ‌రిగింది. ఆ మ‌ధ్య ర‌వితేజ హీరోగా న‌టించిన 'కిక్' సినిమాను ప‌లు పంపిణీ సంస్థ‌ల‌తో క‌లిసి డిస్ర్టిబ్యూట్ చేశారు.

అలాగే బాలీవుడ్ మూవీ 'హార‌ర్ స్టోరీ' చిత్రాన్ని.. త‌మిళ్ హీరో విజ‌య్ హీరోగా న‌టించిన 'త‌లైవా' చిత్రాన్ని తెలుగులో 'అన్న‌' పేరుతో అనువ‌దించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించింది ఈ సంస్థ‌నే. తాజాగా ఈ సంస్థ ఓ నూత‌న కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ప్రారంభించింది. తెలంగాణ సినిమాటో గ్ర‌ఫీ మంత్రి శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ చేతుల మీదుగా ఈ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా అతి త్వ‌ర‌లోనే త‌మ బ్యాన‌ర్ లో కొత్త సినిమా ప్రారంభ‌మ‌వుతుందని నిర్మాత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దాస‌రి కిర‌ణ్ కుమార్, సురేష్ కొండేటి, రైట‌ర్ విస్సు , శేరిలింగం ప‌ల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Similar News