టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-01 12:38 GMT


ఉప్పు.. ఆరోగ్యానికి నిప్పు!

మనదేశంలో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనివల్ల దాదాపు 19 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఇటీవల వెలువరించిన తొలి నివేదకలో ప్రకటించింది.

Breaking : పాలమూరులో తెలంగాణకు మోదీ వరాలు

తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహబూబ్‌నగర్ లో జరిగిన s సభలో మాట్లాడుతూ ఈ రోడ్డు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు.

సలార్ కోసమే ఆ మూవీని డిలీట్ చేశారా..? నెట్టింట హాట్ టాపిక్..!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటడ్ మూవీ 'సలార్' (Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

'యానిమల్' స్టోరీ ముందుగానే చెప్పేసిన పేర్ని నాని.. మీమ్ వీడియో వైరల్..

టాలీవుడ్ దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ' బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'యానిమల్' (Animal). గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఒక టీజర్ రిలీజ్ అయ్యింది.

కొడుకుకు బ్రెయిన్ డెడ్.. ఇద్దరి ప్రాణాలు కాపాడిన కుటుంబ సభ్యులు

అవయవదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి అవయవదానం మరో పునర్‌ జన్మ ఇచ్చినట్లయవుతుంది. ఇలాంటి సాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.

Breaking : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు టిక్కెట్ల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పడిన శ్రమకు ఫలితం టిక్కెట్ అన్నది అందరూ భావిస్తారు. కానీ తమకే టిక్కెట్ అనుకుంటున్న సమయంలో వారికి కాకుండా మరొకరికి టిక్కెట్ దక్కుతుందని తెలిస్తే అంతకు మించి షాక్ ఏముంటుంది?

చంద్రబాబు ఆలోచన వేరట.. అందుకే అలా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి 23 రోజులు అయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. న్యాయస్థానాల్లోనూ చంద్రబాబు వేసిన పిటీషన్ల విచారణ వాయిదా పడుతుండటం, కొన్నింటిని కొట్టి వేయడంతో ఇంకెన్ని రోజులు చంద్రబాబు జైలులో ఉంటారన్న ప్రశ్న క్యాడర్ ను వేధిస్తుంది.

వాహనదారులకు షాకిచ్చిన హీరో మోటో కార్ప్‌

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ రకరకాల వాహనాలను తయారు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే సెలెక్టెడ్ మోటారు సైకిళ్లు, స్కూటర్లపై ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది పెంచనున్నది. అక్టోబర్ 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి కంపెనీ వెల్లడించింది.

బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఆయిల్ కంపెనీలు గ్యాస్, పెట్రోలు ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. తాజాగా ఈరోజుు గ్యాస్ సిలెండర్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. నాల్గో విడత యాత్రకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పవన్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో వారాహి యాత్రను పూర్తి చేశారు.

తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇక టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సమక్షంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Tags:    

Similar News