టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Latest Top 10 Telugu news 15-9-23

Update: 2023-09-15 12:30 GMT

వందే భారత్‌కు కొత్త రూపం.. తక్కువ ఛార్జీలతో కొత్త ట్రైన్‌

సామాన్య ప్రజల కోసం వందే భారత్ ఆర్డినరీ రైలును నడపడానికి భారతీయ రైల్వే పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును నడపడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దాని కోచ్‌లను తయారు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆదిత్య-L1లో మరో కీలక ఘట్టం పూర్తి చేసిన ఇస్రో

సూర్యుని రహస్యాలను బట్టబయలు చేసేందుకు ఇస్రో ఈనెల 2వ తేదీన ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌ భూమికి - సూర్యునికి మధ్య ఉన్న లాంగ్రెస్‌ పాయింట్‌కు అంటే L1కు చేరుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మృతిచెందిన తర్వాత జాహ్నవికి డిగ్రీ

రోడ్డు ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవికి డిగ్రీ ఇవ్వాలని అమెరికాలోని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

5 మార్పులతో బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ

ఆసియాక‌ప్‌లో సూప‌ర్ ఫోర్ స్టేజ్‌లో బంగ్లాదేశ్‌, ఇండియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్ప‌టికే భారత జట్టు ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. బంగ్లాదేశ్‌ మాత్రం సూప‌ర్ ఫోర్ స్టేజ్‌లో ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

పొత్తు ఫలితం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ చిరకాల వాంఛ. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన ఎక్కడకు వెళ్లినా అభిమానుల నోటి నుంచి ఒకే ఒక్క పదం సీఎం.. సీఎం అని మాత్రమే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

‘డెవిల్’ డైరెక్టర్ ట్వీట్ ఎవరికోసం.. వినాశకాలే విపరీత బుద్ధి..!

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రస్తుతం 'డెవిల్' (Devil) మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ బ్రిటిషర్స్ రూలింగ్ టైములో సాగనుంది. కళ్యాణ్ రామ్ ఒక సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

నిరాశపరిచిన జి20 పర్యావరణ ప్రకటన

జి20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత్ గత ఏడాది నుంచి ఉన్న నేపధ్యంలో పర్యావరణం మీద ఒక 4 సమావేశాలు జరిగాయి. చివరి, నాలుగవ సమావేశంలో సభ్య దేశాల పర్యావరణ మంత్రులు, ఇంకా ఇతరులు పాల్గొని ఒక ఉమ్మడి ప్రకటన చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచిత వైద్యం అందరికీ : జగన్

రాష్ట్రంలో మొత్తం 28 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో ఐదు ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

విజయవాడ కాలేజీలలో పోలీసులు

విజయవాడలోని పలు కళాశాలలను పోలీసులు ఖాళీ చేయించారు. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి భారీగా వెళ్లిన పోలీసులు విద్యార్థులను ఇళ్లకు వెళ్లాలని కోరారు. తరగతులు లేవని చెప్పి.. కళాశాలలకు సెలవు ఇప్పించారు పోలీసులు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

డ్రగ్స్ కేసులో నవదీప్.. ఏమైందంటే?

మాదాపూర్ డ్రగ్స్ వ్యహారంలో హీరో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు. నవదీప్ పేరును సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. సీపీగారు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్ నవదీప్ అని చెప్పలేదని నవదీప్ స్పందించాడు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్య తెలంగాణయే ధ్యేయం : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు పూర్తవుతున్నాయన్నారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి





Similar News