టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-26 13:05 GMT


జగన్ పాలన సూపర్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్‌ పాలనకు మంచి మార్కులేశారు. ముఖ్యమంత్రి జగన్ మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు. జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.

వణుకుతున్న నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు హాజరుకానున్నారు.

మట్టి కరిపించాలనే

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మూడోసారి కూడా గెలుపు ఖాయమన్న ధీమాతో ఆయన ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన తాను సులువుగా గెలపించుకోగలనన్న నమ్మకంతో ఉన్నారు.

Breaking : మెడపై మరో కత్తి

యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన యువగళం పాదయాత్రకు తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.

రాటుదేలిపోయారే

రాజకీయాలు తెలియకపోవచ్చు. తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు. తండ్రి సీఎం అని వారు విర్రవీగలేదు. ఇంటి గడప దాటి రాలేదు. భర్త రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నప్పుడు కూడా గృహిణిగా ఉండటానికి ఇష్టపడ్డారు తప్పించి రొచ్చు రాజకీయాల్లోకి చొరబడాలని ప్రయత్నించలేదు.

వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతూ ఉంది. అయితే మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దని హైదరాబాద్ పోలీసులు సూచించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.


ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కేటీఆర్

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.

రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి మూర్ముని నారా లోకేష్ కలిశారు.

గవర్నర్ పై ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఎమ్మెల్సీల విష‍యంలో తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అజెండాతోనే తెలంగాణ గవర్నర్ పనిచేస్తున్నారన్నారు. తమిళి సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యే ముందు రోజు కూడా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

'పెద్ద కాపు' టైటిల్ వెనుక కారణం ఏంటి..? ఆ సామజిక వర్గం..!

టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఫ్యామిలీ, లవ్ ఎమోషనల్ సినిమాల నుంచి టర్న్ తీసుకోని మాస్ సినిమాలు వైపు ప్రయాణం మొదలు పెట్టాడు. 2021లో హీరో వెంకటేష్ తో 'నారప్ప' సినిమా తీసి తనలోని మాస్ డైరెక్టర్ ని బయట పెట్టాడు.



Tags:    

Similar News