రుషికొండ ప్యాలెస్ పై షర్మిల హాట్ కామెంట్స్

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు

Update: 2024-06-20 07:00 GMT

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆమె అన్నారు. ప్రజల సొమ్మును వాళ్ల సమస్యలను తీర్చడానికి కాకుండా నేతల అవసరాలకు వినియోగించడం దారుణమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.

సిట్టింగ్ జడ్జితో...
ఇంతకంటే దారుణమైన పని మరొకటి ఉంటుందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అందుకే గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో చేేపట్టిన నిర్మాణాలపై విచారణ జరిపించాలని, సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పెద్దయెత్తు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నేరమన్నారు.


Tags:    

Similar News