Nara Lokesh : యువగళం పిఠాపురం నియోజకవర్గంలోకి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది ఇప్పటి వరకూ 2944 కిలోమీటర్ల దూరం నడిచారు;

Update: 2023-12-02 04:37 GMT
nara lokesh, padayatra, yuvagalam, pithapuram
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది ఇప్పటి వరకూ 2944 కిలోమీటర్ల దూరం నడిచారు. పాదయాత్ర 215వ రోజుకు చేరుకుంది. నేడు పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఉదయం 8గంటలకు కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.10గంటలకు పవర జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 10.30గంటలకు చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.10.40 గంటలకు చిత్రాడ పంచాయితీ ఆఫీసు వద్ద స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు.10.50 గంటలకుచిత్రాడ మీ సేవా కేంద్రం వద్ద అడ్వకేట్లతో సమావేశం కానున్నారు.

వివిధ వర్గాలతో....
12 గంటలకు పిఠాపురం పాదగయ వద్ద భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం పాదగయ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగించనున్నారు. తిరిగి సాయంత్రం 4.10 గంటలరే పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశమవుతారు. 4.20 గంటలకు పిఠాపురం హాస్పటల్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. 4.30 గంటలకు పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం అవుతారు.4.40 గంటలకు పిఠాపురం పాతబస్టాండు వద్ద టు వీలర్స్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ అవుతారు. 4.45 గంటలకు రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు.


Tags:    

Similar News