TDP : నేడు టీడీపీ పార్లమెంటరీ సమావేశం

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులతో సమావేశం కానున్నారు.

Update: 2024-06-22 03:32 GMT

నేడు టీడీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు లోక్‌సభ పార్టీ నేతను ఎంపిక చేయనున్నారు. దీంతో పాటు పార్లమెంట్ లో పార్టీ ఉప నేతను కూడా నేడు ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ సమావేశం జరగనుంది.

దిశానిర్దేశం చేయనున్న...
ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటులో పార్టీ నేతల ఎంపికతో పాటు సమావేశాల్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకు వచ్చేలా పార్లమెంటు సభ్యులు ప్రయత్నించాలని వారికి చెప్పనున్నారు. ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలను ఈ సమావేశంలో అప్పగించనున్నారని తెలిసింది. ఇద్దరు కేంద్రమంత్రులతో పాటు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.


Tags:    

Similar News