YSRCP : నేడు జగన్ కీలక భేటీ .. అదే అజెండా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2024-09-20 02:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

బాలినేని రాజీనామాతో...
మాజీ మంత్రి బాలినేని శ్రీనిాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపికపై నేతలతో చర్చిస్తారు. బాలినేని వెంట మరింత మంది నేతలు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News