కొండచరియలు విరిగిపడి.. ఏడుగురు మృతి... మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి

Update: 2024-07-16 11:35 GMT

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి. మరికొంత మంది శిధిలాల కింద చిక్కుకుని ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు పదిమంది ఈ శిధిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపైనే కొండ చరియలు విరిగిపడటంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

భారీ వర్షాలకు...
కర్ణాటకలోని ఉత్తర ప్రాంతమైన అంకోలా - శిరాలి రోడ్డు పక్కన ఉన్న హోటల్ పై కొండచరియలు విరిగిపడి పెద్ద పెద్దరాళ్లు పడటంతో అందులో ఉన్న వారు మరణించారని చెబుతున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సక్రమమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలను సిబ్బంది ప్రారంభించారు. మృతుల్లో ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. హోటల్ లో భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు బయటకు రాలేకపోయారు. మఋతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News