నెత్తురోడిన "మహా" రోడ్లు .. 12 మంది మృతి

పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్ కు వెళ్తోన్న బస్సు వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు

Update: 2023-05-23 07:08 GMT

road accidents in maharastra

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సింధఖేదరాజా గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. లోపలి సీట్లు, అద్దాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్ కు వెళ్తోన్న బస్సు వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. క్షతగాత్రులను 108 లో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదానికి గురైన ట్రక్కు లాజిస్టిక్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అమ్రావతి జిల్లాలోనూ ట్రక్కు - ఎస్ యూబీ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ఐదుగురు మృతి చెందారు.




Tags:    

Similar News