బైక్ యాక్సిడెంట్... ఇద్దరు మృతి

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు మృతి చెందారు

Update: 2022-07-15 05:57 GMT

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు మృతి చెందారు. బైకుపై వేగంగా వస్తూ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టడంతో ీఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖైరతాబాద్ లో ఈరోజు తెల్లవారుజామున ఇద్దరు యువకులు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు.

కర్ణాటక వాసులుగా....
దీంతో యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు ఇద్దరూ కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అతివేగం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News