ఘోర ప్రమాదం : ఆటోని ఢీ కొట్టిన లారీ

ఇద్దరు లారీ చక్రాల కింద పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు గూడురు సొసైటీకి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్, గూడూరు;

Update: 2022-02-17 11:36 GMT
road accident, rtc buses, yadyar bhuvanagiri district
  • whatsapp icon

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. చింతవరం నుంచి గూడూరు వైపుగా వెళ్తున్న ఆటోని వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవ్వగా.. డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుని మరణించాడు.

మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు గూడురు సొసైటీకి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్, గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన హరిసాయి, రాజశేఖర్ లుగా గుర్తించారు. హరిసాయి, రాజశేఖర్ లు ఒక ఏజెన్సీలో పనిచేస్తున్నారు. సంస్థకు సంబంధించిన సరుకులను దుకాణాలకు వేసి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు వివరాలను సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News