ధోనిపై నమ్మకం.. దేవుడిని ప్రార్ధించినా..?

చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో ఓటమి పాలయింది

Update: 2023-04-13 04:16 GMT

ధోని ఉన్నాడుగా.. అతడికి తోడు జడేజా కూడా ఉన్నాడు. ఇక గెలుపు మనదే అనుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ధోని అంటే అంత విశ్అవాసం. అపారమైన నమ్నుమకం అతని ఫ్యాన్స్ కు. అనుకున్నట్లుగానే వేగంగా స్కోరు బోర్డు మీద రన్స్ పెంచారు. చివరి బాల్ కు ఐదు పరుగులు చేయాల్సి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ధోనీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ధోని మైదానంలోకి వచ్చినప్పుడు స్కోరు భారీగానే ఉంది. ధోని 17 బంతుల్లో 32 పరుగులు చేయడంతో పాటు జడేజా 25 పరుగులు చేయడంతో ఇక గెలుపు తమదేనని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ నమ్మారు. దేవుళ్లను ప్రార్ధించారు.

చివరి బంతి వరకూ...
చివరి బాల్ కు ధోని స్ట్రైక్ లో ఉన్నాడు. ఐదు పరుగులు అవసరం. ఫోర్ కొడితే సూపర్ ఓవర్ వస్తుంది. సిక్సర్ కొడితే విజయం లభిస్తుంది. రెండూ ధోని వల్ల సాధ్యమవుతుందని భావించినా రెండు పరుగులు చేయడంతో మూడు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ అందరినీ ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ తన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది పరుగులు కోల్పోయి 175 పరుగులు చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 20 ఓవర్లకే 172 పరుగులు చేసి ఓటమి పాలయింది. దీంతో ధోని సేన నిరాశలో మునిగిపోయింది.


Tags:    

Similar News