"మిస్టర్ ఐపీఎల్" సురేష్ రైనాకు ఊహించని షాక్

"మిస్టర్ ఐపీఎల్" గా పేరొందిన సురేష్ రైనా కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్లలో 5 వేల పరుగులు

Update: 2022-02-12 09:58 GMT

"మిస్టర్ ఐపీఎల్" గా పేరొందిన సురేష్ రైనా కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్లలో 5 వేల పరుగులు చేసిన సురేష్ రైనా ను తొలిరౌండ్ లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. చైన్నె సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాను "చిన్న తలా" అని పిలుచుకుంటారు అభిమానులు. అయితే.. సీఎస్ కే కూడా బిడ్ వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకపోవడం విశేషం. ఇక సౌతాఫ్రికా క్రికెటర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఈ సీజన్ లో అమ్ముడుపోని మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. మిల్లర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. బిగ్‌బాష్ లీగ్ 2022 సీజన్‌‌లో అదరగొట్టినప్పటికీ షకీబ్‌ను కొనుక్కోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.





Tags:    

Similar News