మహర్షి రిలీజ్ డేట్ మళ్లీ మారిందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5న [more]

Update: 2019-03-06 08:25 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అవుతుందని ఏప్రిల్ 25 కు షిఫ్ట్ చేసారు. అయితే ఇప్పుడు 25 కాదు మే 9న రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. మరి కొన్ని గంటల్లో నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. షూటింగ్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మహేష్ ను కన్వీన్స్ చేస్తున్న దిల్ రాజు

ఏప్రిల్ 13 వరకు షూటింగ్ పనులు ఉన్నాయి. అందుకే మహేష్ ను కన్విన్స్ చేసే పనిని నిర్మాత దిల్ రాజు తన మీద వేసుకున్నారు. మే అంటే మహేష్ బాబుకి ఒప్పుకుంటాడా? అని అడిగితే.. అదేమీ లేదని, సినిమా చాలా బాగా వచ్చిందని, పక్కా హిట్ అని యూనిట్ భావిస్తోంది. కాబట్టి మహేష్ కూడా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారంగా ప్రకటన రానుంది.

Tags:    

Similar News