వర్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మార్చి 22 న లక్షీస్ ఎన్టీఆర్ విడుదల అంటూ [more]

Update: 2019-03-14 08:08 GMT

లక్ష్మీస్ ఎన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మార్చి 22 న లక్షీస్ ఎన్టీఆర్ విడుదల అంటూ ట్రైలర్స్ తో, సాంగ్స్ తో హంగామా చేస్తున్నాడు వర్మ. ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమా వస్తే టీడీపీ మీద వ్యతిరేకత వస్తుందని టీడీపీ నేతలు, నందమూరి ఫ్యామిలీ టెన్షన్ పడుతున్నారు. మరోపక్క చంద్రబాబు లక్షీస్ ఎన్టీఆర్ తో విలన్ గా ప్రజల్లో మిగిలిపోతాడు. అందుకే సినిమాని ఆపాలంటూ టీడీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై మీడియాలో సస్పెన్సు కొనసాగుతుంది. ఈలోపు వర్మ మరో ప్లాన్ తో అందరినీ ఉడికించడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినబడుతుంది. లక్షీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఆగిపోయే అవకాశం ఉందంటూ మీడియాలో వార్తలోస్తున్న నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ ప్రీమియర్ షో ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రీమియర్ షో వేయాలని…

ఈ ప్రీమియర్ సినిమా విడుదలకు వారం ముందే వేయాలనే ప్లాన్ లో వర్మ ఉన్నాడట. అలాగే మీడియా వారికి, కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రీమియర్ షో వేసి చూపాలని వర్మ ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ప్రీమియర్ ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ టాక్ స్ప్రెడ్ చెయ్యొచ్చనే ఆలోచనతో వర్మ ఈ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. మరి వర్మ ప్లాన్ వర్కౌట్ అయితే గనక సినిమా టాక్ తోనే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అంతేకాకుండా ప్రీమియర్ వేశాక.. టాక్ బయటికొచ్చేస్తుంది కాబట్టి.. ఇక సినిమా ఆపే దైర్యం ఎవరూ చెయ్యరనే వర్మ ఈ మాస్టర్ ప్లాన్ వేసుంటాడంటున్నారు. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ లోకి వచ్చే వరకు సస్పెన్స్ గానే కనబడుతుంది.

Tags:    

Similar News