మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిన కంటెస్టెంట్స్ మళ్ళీ తిరిగి లోపలికి ఎంట్రీ ఇచ్చారు.

Update: 2023-10-15 04:50 GMT

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఆరో వారం పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెడుతుంది. ఐదు వారలుగా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ బయటకి వెళ్తూ వచ్చారు. ఇక ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకి రాబోతున్నారు అనేది అందరిలో ఆసక్తి నెలకుంది. ఆడియన్స్ అంతా ఎలిమినేషన్ గురించి ఆలోచిస్తుంటే, బిగ్‌బాస్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయిన వారిని మళ్ళీ లోపలి తీసుకు వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.

గత వారం హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీతో లోపలికి తీసుకు వచ్చిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఎలిమినేషన్ అయిన వారిని కూడా మళ్ళీ హౌస్ లోకి తీసుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటి వరకు హౌస్ నుంచి కిర‌ణ్ రాథోడ్‌, ష‌కీలా, దామిని, ర‌తిక, శుభశ్రీ.. ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లారు. ఈ ఐదుగురి కంటెస్టెంట్స్ లో.. సింగ‌ర్ దామిని, ర‌తిక, శుభ శ్రీ మళ్ళీ తిరిగి హౌస్ లోకి వచ్చారు.
Full View
"ఈ సీజన్ ఉల్టా పల్టా. ఏదైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు" అని నాగార్జున చెప్పడం, ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోని ముగించారు. ఇక ఈ కంటెస్టెంట్స్ హౌస్ లోకి గెస్ట్‌లుగా వచ్చారా..? లేదా కంటెస్టెంట్స్ గానే రీ ఎంట్రీ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది. నేడు దసరా నవరాత్రుల పండుగా మొదలు అవుతుండడంతో.. వీరి ముగ్గురుని ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో భాగంగా లోపలికి తీసుకు వచ్చి ఉండవచ్చని తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు. బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడు అనేది.

కాగా ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో శోభా శెట్టి, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, ప్రిన్స్‌ యావర్‌, అమర్‌దీప్‌, టేస్టీ తేజ ఉన్నారు. ఇక వీరిలో శోభా శెట్టి గేమ్ తీరుపై బాగా ట్రోలింగ్ జరుగుతుంది. కొన్ని టాస్క్‌ల్లో శోభా శెట్టి.. మరి చిల్లరిగా ప్రవర్తిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆడియన్స్ లో ఈ భామపై నెగటివిటీ రావడంతో.. ఓట్లు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని నెటిజెన్స్ చెబుతున్నారు.


Tags:    

Similar News