మహిళను చెట్టుకు కట్టేసి.. భర్త చేసిన పని ఏమిటంటే..?

మహిళను చెట్టుకు కట్టేసి.. భర్త చేసిన పని ఏమిటంటే..?

Update: 2022-07-31 13:05 GMT

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, ఇతర బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టారు భర్త కర్రతో కొట్టడంతో ఆ మహిళ నొప్పితో కేకలు వేయడం కనిపించింది. భర్త తన భార్య వేరే వ్యక్తితో ఉండడాన్ని చూశాడు. కోపంతో ఈ విధంగా హింసించారు. ఆమెను ఏడు గంటల పాటు చెట్టుకు కట్టేసి ఉంచారు. ఆమెతో కనిపించిన వ్యక్తికి కూడా ఇదే విధమైన శిక్ష విధించారు. మరొక వీడియోలో మహిళ స్నేహితుడిని చెట్టుకు కట్టివేసి, కొంతమంది వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. మహిళపై దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదైంది, ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితురాలి భర్త, ఆమె బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు అధికారులు. ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో మహిళ భర్త మహావీర్, బావ కమలేష్ కూడా ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ మీనా తెలిపారు. మరో ఇద్దరిని మణిలాల్, బ్రజేష్‌గా గుర్తించారు. జులై 25న మహిళపై ఖమేరా పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, శాంతిభద్రతల పరిస్థితిపై బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేస్తూ, "రాజస్థాన్ హోం శాఖ గూండాలను విడిపించింది. వారు ఆకలితో ఉన్న తోడేళ్ళలా అడవుల్లో తిరుగుతున్నారు. ఈ వీడియోపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలో. కానీ ఈ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుందని ఆశలు పెట్టుకోవడం అర్థరహితం. మనం స్వరం పెంచాలి! " అని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) శనివారం ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్ డీజీపీకి రాసిన లేఖలో, ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి ఉత్తమ వైద్యం, భద్రత కల్పించాలని అధికారులను కోరారు.


Tags:    

Similar News