విశాఖలో డ్రగ్స్ దందా.. ముగ్గురు అరెస్ట్

బెంగళూరు నుంచి విశాఖకు స్ఫటిక (ఎండిఎంఏ) రూపంలో డ్రగ్స్ రవాణా సాగిస్తున్నట్లు తేలింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో..

Update: 2022-04-13 10:21 GMT

విశాఖపట్నం : విశాఖలో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. చినవాల్తేర్ లో విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బెంగళూరు నుంచి విశాఖకు స్ఫటిక (ఎండిఎంఏ) రూపంలో డ్రగ్స్ రవాణా సాగిస్తున్నట్లు తేలింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 54 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. స్ఫటిక రూపంలో డ్రగ్స్ దొరకడం ఇదే తొలిసారి. నిందితులు బెంగళూరు నుంచి ఉత్ప్రేరకాలను తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ స్నేహితుల ద్వారా డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లు నిర్థారించారు. కాగా.. ఈ డ్రగ్స్ దందా వెనుక ఈ ముగ్గురే కాకుండా మరెవరైనా ఉన్నారా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News