Breaking : ఈదురుగాలులకు కూలిన గోడ.. నలుగురి మృతి

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని తాండూరులోని గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు.

Update: 2024-05-26 12:45 GMT

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని తాండూరులోని గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. భారీ వర్షం, ఈదురుగాలులకు కోళ్లపారం గోడ కూలడంతో అక్కడే ఉన్న నలుగురు కార్మికులు మరణించినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

కోళ్లఫారం ప్రహరీ గోడ...
ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో పాటు వర్షం పెద్దయెత్తున కురియడంతో కోళ్లఫారం ప్రహరీ గోడ కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన నలుగురు కార్మికులుగా గుర్తించారు. మరో ఇద్దరి కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News