బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

స్థానికుల సమాచారంతో.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి

Update: 2022-01-09 06:00 GMT

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కేపీహెచ్ బీ కాలనీ వైపు వెళ్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా అతివేగంగా ముందుకు దూసుకెళ్లింది టిప్పర్. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల సమాచారంతో.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News