ఏపీలో ప్రీ పోల్స్‌ పక్కా.. జగన్‌ ప్లాన్‌ వేరే

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని;

Update: 2023-06-13 08:08 GMT
Opposition parties , early elections, APnews, TDP, Janasena
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటికీ, వర్షాకాల సమావేశాల అనంతరం జులైలో జగన్ అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్‌లో తెలంగాణతో సహా ఇతర ఐదు రాష్ట్రాలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. షెడ్యుల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను నమొద్దని టీడీపీ, జనసేన అధిష్ఠానాలు.. తమ పార్టీ శ్రేణులకు సూచించాయి.

ప్రత్యర్థి పార్టీల దృష్టి మరల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వైఎస్‌ జగన్ పన్నిన ఎత్తుగడ ఇది అని అంటున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఒంటరిగానే సాగుతుంది తప్ప ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పొత్తులు అవసరమైతే పార్టీ నేతలకు ముందస్తుగా సమాచారం ఇస్తానని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు, పొత్తు ఖాయమని ఆయన చెప్పారు. అయితే పొత్తులపై పవన్‌ మరింతగా వివరించలేదు. వాస్తవానికి పవన్ తన నిర్మాతలతో సంప్రదింపులు జరిపి తన షూటింగ్ షెడ్యూల్‌లను రీవర్క్ చేశాడు. తన వారాహి యాత్రను ఆగస్టులో ప్రారంభించాలనుకున్నానని, అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నందున, పార్టీని బూత్‌ స్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, క్యాడర్ పోల్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు.

డిసెంబరులోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో టీడీపీ కూడా తమ క్యాడర్‌ను జన సంపర్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరింది. గత వారం తిరుపతి, విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ, జగన్‌మోహన్‌రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో జనసేన, టీడీపీ రెండూ బీజేపీ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్నాయి. బీజేపీ ద్వంద్వ ఆట ఆడుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి సహాయపడే వ్యూహంలో భాగంగానే వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేక వైఖరి ఉందని ప్రజల్లో సాధారణ భావన ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన పొత్తుల చ‌ర్చ‌లు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News