Revanth Reddy : నేడు ఫ్యామిలీ డిజిటల్ పైలట్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను పైలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు

Update: 2024-10-03 04:30 GMT

revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను పైలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్​ సిక్ విలేజీలోని హాకీ గ్రౌండ్స్​లో ఫ్యామిలీ డిజిటల్​ కార్డుల కుటుంబ డిజిటల్ కార్డ్‌ల పైలెట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్...
అనంతరం ఈరోజు మధ్యాహ్నం 3.30 కు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తో పాటు నియమకపత్రాల ప్రక్రియను సమీక్షిస్తారు. సాయంత్రం 4.15కు ఎల్​బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్​ 2024 ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు.
Tags:    

Similar News