రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు

Update: 2024-09-15 14:05 GMT

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. లాంఛనప్రాయ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పార్టీ జెండాను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసి, పార్టీని నూతనోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు మహేశ్‌ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

గాంధీ భవన్ ఒక దేవాలయమని, విబేధాలు పక్కకు పెట్టీ అందరూ కలిసి పనిచేయడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో ఆర్డినేట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అందరూ కలిసి పని చేస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు. గాంధీ భవన్ లో తాను తాకని ప్రదేశం లేదని, ప్రజాస్వామ్యయుతంగా ఉంటానన్నారు. పదవులు ఎందుకు రాలేదని తాను అనుకోలేదని, పని చేస్తూ వెళ్ళానన్నారు. రాజకీయాల్లో ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క శాతం అదృష్టం ఉండాలని అన్నారు.


Tags:    

Similar News