Revanth Reddy : సుప్రీంకోర్టులో రేవంత్ కు ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు బదిలీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది

Update: 2024-09-20 06:27 GMT

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు బదిలీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే మరొక హైకోర్టుకు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి వేసిన పిటీషన్ కొట్టివేసింది. మరొక కోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని కూడా సుప్రీకోర్టు కోరింది.

బీఆర్ఎస్ పిటీషన్ కొట్టివేత...
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నందున ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని జగదీశ్వర్ రెడ్డి కోరారు. అయితే హైకోర్టుపై అలాంటి అభాండాలు వేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసు విషయాలను ఏసీబీ కూడా రేవంత్ రెడ్డికి సమాచారం ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News