Telangana : నేడు రేవంత్ షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షను నిర్వహించనున్నారు.

Update: 2024-09-23 04:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్త్ కార్డుల జారీపై అధికారులతో చర్చించనున్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో హెల్త్ కార్డుల జారీ ప్రక్రియపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

విషజ్వరాలపైన...
దీంతో పాటు తెలంగాణ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులలతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. డెంగ్యూ వంటివి పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.


Tags:    

Similar News