ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కేటీఆర్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు

Update: 2023-09-26 11:02 GMT

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం పైనా, హైదరాబాద్ లో ర్యాలీల పైనా మంత్రి కేటీఆర్ స్పందించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు? ఏపీలో చేస్కోండి.. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. హైదరాబాద్‌ లో మాత్రం ఇలాంటి ర్యాలీలు ఎవరు చేసిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అరెస్ట్ పై చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలన్నారు. వైఎస్‌ జగన్‌, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌ నాకు మిత్రులే.. ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. చంద్రబాబు అంశం కోర్టులో ఉంది.. దీని గురించి మాకు అనవసరం. లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. అందుకే ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పానని గుర్తుచేశారు.


Tags:    

Similar News