Telangana : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పు

తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి

Update: 2024-06-26 07:49 GMT

తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. ఈ నెల 27వ తేదీ నుంచి బీటెక్ లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని ప్రకటించారు. అయితే దీనిని జులై 4వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. జులై ఆరో తేదీ నుంచి పదమూడో తేదీ వరకూ తొలి విడత సర్టిఫికేషన్ వెరిఫికేషన్, జులై 8వ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు చివరి నాటికి...
జులై 19వ తేదీన ఇంజినీరింగ్ తొలి విడత సీట్లు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలాగే రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జులై 26వ తేదీ నుంచి జరుగుతుంది. 27,28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశమిస్తారు. జులై 31వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్లు కేటాయింపు పూర్తి చేస్తారు. ఆగస్టు 8వ తేదీ నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 9న మూడో విడత కౌన్సిలింగ్ జరుగుతంది. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకుఅవకాశం కల్పిస్తారు. ఆగస్టు13న ఇంజినీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారని తెలిపారు.


Tags:    

Similar News