పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్

Update: 2023-09-30 09:38 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించింది. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలు చూస్తున్న పెండ్యాల శ్రీనివాస్ ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదు ఆయన.

పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే అమెరికా వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే విదేశాలకు వెళ్లాలి. ఈ నిబంధనను అతిక్రమించడంతో పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ మెమో జారీ చేసింది. అమెరికా టూర్ పై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. పెండ్యాల శ్రీనివాస్ సంజాయిషీ ఇవ్వకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News