ముంబై నటి "కాదంబరి జత్వానీ" కేసులో కీలక అప్డేట్ ..!!

ప్రముఖ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విషయమై ... ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మీ ని మీడియా

Update: 2024-09-14 11:15 GMT

ప్రముఖ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విషయమై ... ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మీ ని మీడియాప్రతినిధులు సమాధానం కోరగా...ఆవిడ కొన్ని విషయాలు మీడియా వాళ్ళతో ప్రస్తావించారు..!! ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు,ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం మహిళా కమీషన్ ఏర్పాటు చేయబడింది..!!

ఈ రాష్ట్ర మహిళా కమిషన్ కి ఒక యాక్ట్ ఉంది...ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో మేము జోక్యం చేసుకోము..ముంబై నటి కాదంబరి విషయంలో...అనేక రకాల కథనాలు వ్యక్తమవుతున్నాయి..!! మహారాష్ట్ర లో కూడా మహిళా కమీషన్ ఉంటుంది.. దానికి కూడా ఒక మహిళా చైర్ పర్సన్ ఉంటుంది..దానికి కూడా ఒక యాక్ట్ ఉంటుంది..తనకి ఇక్కడ ఏదైతే జరిందని చెప్తోందో...అదే విషయం అక్కడ మహిళా కమీషన్ చైర్ పర్సన్ తో చెప్పి, కంప్లైంట్ ఇస్తే..తప్పు చేసిన వాళ్ళు ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు ఎవరైనా సరే వారి మీద ఆ మహిళా కమీషన్ తప్పుకుండా చర్యలు తీసుకుంటుంది...!!??

చదువుకోని వాళ్లు ఈ రోజు మారుమూల ప్రాంతాల్లోని వాళ్ళు కూడా మహిళా కమీషన్ కి ఫిర్యాదులు చేస్తున్నారు.. అయితే అత్యంత ఉన్నతమైన చదువులు చదివిన ముంబై నటి కాదంబరి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమీషన్ ని ఆశ్రయించలేదు..అని విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు..!! అయితే ఇటీవల ముంబై నటి కాదంబరి జత్వానీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే..!! తనని,తన ఫామిలీని కనీసం తన ఫ్యామిలీ లాయర్ తో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా... ముంబై నుంచి తీసుకొచ్చి,తమ బ్యాంకు అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ చేయించి,తమపై ఒక నకిలీ భూవివాదం కేసు సృష్టించి,తమ కుటుంబం మొత్తాన్ని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టారని, మీడియా ముందే చెప్తూ....కన్నీరు పెట్టుకున్నారు..

ఈ నటి కాదంబరి కేసు విషయాన్ని సుమోటోగా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎంక్వైరీ కి పిలుపునిచ్చింది..!!

Tags:    

Similar News